telugu navyamedia
వార్తలు సామాజిక

ఈ నెల 6న కేరళలోకి రుతుపవనాలు

మొన్నటి వరకు మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైన పజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 6వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరేబియ సముద్ర దక్షిణ భాగంతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బెంగాల్‌, అండమాన్‌-నికోబార్‌ దీవులపై రుతుపవనాలు కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రంలోని అన్ని భాగాల్లో రుతుపవనాలు కప్పివేయనున్నట్లు ఐఎండీ సీనియర్‌ అధికారి మహాపాత్ర తెలిపారు.

Related posts