telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్ర‌భాస్‌ను ఢీ కొట్ట‌నున్న బాలీవుడ్ స్టార్‌..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో జోష్ పెంచేస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ ను నటింప చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సలార్ లో విలన్ గా నటించే విలన్ ఎవరో తెలుసా ? ఇంకా ఎవరో కాదు జాన్ అబ్రహం. పాన్ సినిమా కావడంతో, సలార్ లో నటించడానికి జాన్ అబ్రహం సైతం అందుకు ఒకే చెప్పాడట. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Related posts