ఈనెల 28వ తేదీన లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు సాంబిరెడ్డి తెలిపారు. కూకట్పల్లిలోని ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్టు కార్యాలయ భవనం మొదటి అంతస్తులో జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి 4గంటల వరకూ కొనసాగుతుందన్నారు.
ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొని అర్హత గల వారిని ఎంపిక చేసుకొంటారని ఆయన వివరించారు. అసక్తిగలవారు పూర్తి బయోడేటాతో హాజరుకావాలన్నారు. వివరాలకు 83408 92683, 994838 7793 ఫోన్నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.