ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ) విద్యార్థులు, టీచర్లపై జరైగిన దాడి ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.’జేఎన్యూలోని విద్యార్థులు, టీచర్లపై దాడి ఘటన సిగ్గుచేటన్నారు. తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా పరిగణించాలి. న్యాయవిచారణకు ఆదేశించాలి’ అని మయావతి సోమవారంనాడు ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
ఆదివారంనాడు జేఎన్యూలోకి ప్రవేశించిన సుమారు 50 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ తమకు పలు ఫిర్యాదులు అందాయని, త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు ఘోష్తో పాటు సుమారు 26 మంది విద్యార్థులు గాయపడ్డారు.