జార్ఖండ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఈ రోజు ముగుసింది. ఈ రోజు 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ తొలివిడుత పోలింగ్ నిర్వహించింది. తొలివిడతలో 62.87 శాతం పోలింగ్ నమోదయింది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు నవంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. ఐదు విడుతలుగా పోలింగ్ జరుగనుంది. ఐదు విడుతలుగా జరుగనున్న ఈ ఎన్నికలకు వేర్వేరు తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ విత్డ్రా, పోలింగ్ తేదీలు ఉన్నాయి. తుది ఫలితాలు డిసెంబర్ 23న విడుదల కానున్నాయి.