telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ కు చేరుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ మ‌ధ్యాహ్నం ఆయ‌న హైద‌రాబాద్ స‌మీపంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంత‌రం సాయంత్రం ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు.

కేసీఆర్‌తో భేటీ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాల‌పై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపైనా ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించ‌నున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ప్రత్యామ్నాయంగా కూట‌మి క‌ట్టే దిశ‌గా కేసీఆర్ ఆలోచ‌న చేస్తుండ‌గా.. దానిపైనా హేమంత్ సోరెన్ చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు.

Related posts