ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 15 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 221 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47,85,009 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో 23 మంది మహిళలు ఉన్నారు. బొకారో స్థానం నుంచి అత్యధికంగా 25 మంది పోటీ పడుతున్నారు.
ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జమువా, బోగడర్, గిరిధ్, దుమ్రి, తుండి తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి రాజ్ పలివార్, రెవెన్యూశాఖ మంత్రి అమర్ కుమార్ బౌరీలు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
బెంగాల్ లో హింస రాజ్యమేలుతోంది: మోదీ