పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది.
శుక్రవారం మధ్యాహ్నం తుది కీ విడుదల చేసిన అధికారులు విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించగా.. 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.
రాజస్థాన్కు చెందిన మహ్మద్ అనాస్ ఫస్ట్ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ రెండో ర్యాంకు సాధించారు.
100 పర్సంటైల్ సాధించిన వారిలో తెలంగాణ నుంచి హర్ష ఎ.గుప్తా, వంగల అజయ్రెడ్డి, బనిబ్రత మజీ, ఏపీ నుంచి సాయిమనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు.
కాగా, హర్ష ఎ.గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించగా, అజయ్రెడ్డి ఆలిండియా 16వ ర్యాంకుతో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్లో నిలిచాడు.
సాయిమనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకు, బాలికల్లో 2వ ర్యాంకు సాధించింది. బనిబ్రత మజీకి ఆలిండియా 24వ ర్యాంకు లభించింది.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్