రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ మహిళపై జేసీబీతో తొక్కించేందుకు ప్రయత్నించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. భూ వివాదంపై కారణంగానే ఒంటరి మహిళపై కొందరు మహిళలు, పురుషులు దాడి చేశారు.
దీంతో ఆ మహిళ తనను తాను కాపాడుకునేందుకు రాళ్ళు ఇటుకలను విసిరినట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన బైతు పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భూవివాదం కారణంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగిందని, ఆ భూమి ఎవరికి సొంతం అనే విషయంపై గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరుగుతుందని, చివరకు ఆ భూమిలో నిర్మాణం చేసేందుకు ఓ వర్గం వెళ్లగా.. వారిని అడ్డుకునేందుకు మరో వర్గం ప్రయత్నించిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
మరోవైపు, మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసింది.“ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ తన ‘లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్’ నినాదంతో ప్రజలను మోసం చేస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో, ఈ రోజు పట్టపగలు ఏమాత్రం భయపడని పోకిరీల గుంపు ద్వారా ఒంటరి మహిళపై భౌతిక దాడి జరిగింది. అని బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు.
While @priyankagandhi is fooling people with her 'Ladki hoon lad sakti hoon' slogan in #UttarPradesh, in #Congress ruled #Rajasthan, a single woman was physically assaulted today in broad daylight by a bunch of hooligans who have absolutely no fear of the law!! #Shame pic.twitter.com/dGlJuDJu9Q
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) November 18, 2021