telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బలమైన నాయకులంతా భయపడి ఏసీల్లో కూర్చున్నారు…టీడీపీ ఓటమిపై జేసీ కామెంట్‌ !

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఫ్యాన్‌ గాలికి టీడీపీ సైకిల్‌ చతికిలపడింది. హిందూపురంలో బాలయ్య, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రచారం చేసినా.. పార్టీ సరైన స్థానాలు గెలవలేకపోయింది. అయితే.. తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించగా… మైదుకూరులో కూడా టీడీపీ లీడింగ్‌ లో ఉంది. ఇక తాడిపత్రిలో గెలుపు గురించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తాడిపత్రి ప్రజలు విజయమని.. వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కష్టాలలో ఉన్నప్పుడు తన వెంట ఉన్నారని… సేవ్‌ తాడిపత్రి నినాదం ప్రజలల్లోకి బలంగా చొచ్చుకుపోయిందని వెల్లడించారు. బలమైన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని కానీ నాయకులు భయపడి ఏసీలలో కూర్చుంటున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు నాయకలను మార్చాలన్న ఆయన.. జేసీ కుటుంబం మీద అభిమానంతో ఉన్న ప్రజలు తనకు పట్టం కట్టారని పేర్కొన్నారు.

Related posts