“మహానటి”తో జాతీయ పురస్కారాన్ని అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా స్వప్న సినిమాస్ బ్యానర్పై ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. 210, 420, 840 నెంబర్లు గల జైలు దుస్తులు ధరించి ఉన్న ప్రియదర్శి, నవీన్, రాహుల్ పోస్టర్ బయటకు వచ్చింది. “సత్ప్రవర్తన వల్ల త్వరగా బయటికొస్తున్న మా వాళ్ళు. ఈ దీపావళికి మీ జాతిరత్నాలు” అనే కామెంట్తో పోస్టర్ని రిలీజ్ చేశారు. “ఫన్నీయెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్” అని మోషన్ పోస్టర్లో పేర్కొన్నారు. విభిన్నమైన బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. ఇప్పటకే ఈ సినిమా షూటింగ్ 80శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. రధన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.