telugu navyamedia
సినిమా వార్తలు

తిరుపతిలోనే పెళ్ళి అంటున్న జాన్వీ కపూర్

Jhanvi-Kapoor

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు సినిమా స్క్రిప్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించడమే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తుంటారు. తెరపై అందంగా కనిపించడం కోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్క్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. శ్రీదేవితో మీరెపుడైనా పెళ్లి గురించి మాట్లాడారా…? అని జాన్వీని ప్రశ్నించారు. దీనికి జాన్వీ సమాధానమిస్తూ “పెళ్లి గురించి అమ్మతో మాట్లాడాను. అయితే మగవాళ్ల విషయంలో నా తీర్పుపై నమ్మకం లేదని అమ్మ చెప్పేది. అమ్మనే ఎవర్నో ఒకరిని ఎంపిక చేయాలనుకునేది. నేను ఎవరినైనా సులభంగా ప్రేమించడమే అందుకు కారణమని జాన్వీ చెప్పింది. తనకు కాబోయే జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలేంటని జాన్వీని అడుగగా… అతనికి తను చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. మంచి టాలెంట్ ఉండాలి. అతని దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలి. అంతేకాకుండా అందరిని నవ్వించే స్వభావం ఉన్నవ్యక్తి అయి ఉండాలని చెప్పింది. ఇక తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో తిరుపతిలో జరుగుతుందని వెల్లడించింది జాన్వీ. అంతేకాదు సంప్రదాయ కంజీవరమ్ చీరను ధరిస్తా. మొత్తం దక్షిణాది వంటకాలతో నా పెళ్లి వేడుక ఉంటుందని చెప్పుకొచ్చింది.

Related posts