ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ స్థానంలో కాస్త ముందంజలో ఉన్నారు. భీమవరంలో మూడో స్థానంలో నిలిచిన పవన్ కల్యాణ్ తాజాగా విశాఖపట్నంలోని గాజువాకలో ఆధిక్యం చూపుతున్నారు. మరోవైపు విశాఖ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ, వీవీ లక్ష్మీనారాయణ వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ వీవీ లక్ష్మీనారాయణపై 21,000 ఓట్ల లీడింగ్ తో దూసుకుపోతున్నారు.
అలాగే నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు జనసేన అభ్యర్థి కొణిదెల నాగబాబు, టీడీపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజులపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం వైసీపీ 145 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా, టీడీపీ 29 స్థానాలకు పరిమితమయింది.
వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయం: గల్లా జయదేవ్