జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పవన్ కళ్యాణ్కు నెగిటివ్గా నిర్దారణ అయింది. హైదరాబాద్లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పవన్కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో… ఆయన త్వరగానే కోలుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు జనసేన వర్గాలు గాని, ఆసుపత్రి వైద్యులు గాని అధికారికంగా వెల్లడించలేదు. కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 16 న కరోనా బారిన పడ్డారు.ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్లు చేయించుకున్నారు.. అయితే, ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి.. కానీ, అప్పటి నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రంలో హోం క్వారంటైన్లోనే ఉన్నారు.. జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెట్టడంతో.. రెండో రోజుల క్రితం మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించగా.. పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జనసేన పార్టీ పేర్కొంది.