కరోనాను నియంత్రించేందుకు లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. లాక్డౌన్తోపాటు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు పవన్ సూచించారు. విపత్తు సమయంలో పేదలకు జనసేన అండగా ఉంటుందన్నారు.
లాక్డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పవన్ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాలపై మాట్లాడదామని పవన్ అన్నారు. ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంచడంపై ఈసీకి ఫిర్యాదు చేయాలని పవన్ స్పష్టం చేశారు.
మోదీతో గొడవవద్దని చంద్రబాబుకు చెప్పాను.. వినిపించుకోలేదు: అంబికా కృష్ణ