లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమై ఇబ్బందులుపడుతున్న కూలీలను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు, వినాయక్ రూ.5లక్షల విరాళాలు ప్రకటించగా, తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలకు ఒక కోటి విరాళం ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50లక్షల ఇస్తానన్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు.