telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ మంత్రులు నోరు తెరిస్తే బూతులే: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రులు నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

సీఎం జగన్ పై విమర్శలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు మూకుమ్మడిగా ప్రతి విమర్శల దాడి చేయడం తగదని అన్నారు. ప్రజాసమస్యలను పవన్ ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని అన్నారు. సమస్యల పై స్పందించాల్సిన మంత్రులు ఈవిధంగా పవన్ పై ప్రతి విమర్శలు చేయడం సబబు కాదని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

Related posts