telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అగ్రనేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్

pawan

ఏపీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు అన్ని పార్టీలకు హైకోర్టు అవకాశమిచ్చిన న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఈ రోజు నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, హరిప్రసాద్ వంటి అగ్రనేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్న పిమ్మట కౌంటర్ దాఖలుపై నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని తరలింపునకు సంబంధించిన వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన అధిష్టానం తీర్మానించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణ, రాజధాని తరలింపు అంశాల్లో జనసేన తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయంతో ఉందని వెల్లడించారు.

ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చేసిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని జనసేన బలంగా చెబుతోందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజధాని తరలింపుకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని తెలిపారు. హైకోర్టు దీనికి సంబంధించిన వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన నేపథ్యంలో గడువులోగా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

Related posts