telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కార్మికుల ఆత్మహత్యలు చూస్తుంటే బాధేస్తోంది: నాదెండ్ల మనోహర్

manoher nadendla

భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చూస్తుంటే మనసు కలచి వేస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక దీక్ష నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న పరిణామాలు ఒకలా ఉంటే, వైసీపీ ప్రభుత్వం తీరు మరోలా ఉందని విమర్శించారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక నూతన పాలసీ అంతా ఆర్భాటమ ఏ తప్ప పేదలకు ఉపయోగపడేలా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకుని ఇసుక సరఫరాలో ఇబ్బందు లేకుండా చూడాలని కోరారు. పనుల్లేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, పనుల్లేని కాలానికి నెలకు రూ.10 వేలు చొప్పున కార్మికులకు భృతి అందించాలన్నారు.

Related posts