జనసేన అధినేత పవన్కల్యాణ్ మిత్రపక్షం సీపీఐకి మరో షాకిచ్చారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజైన ఈరోజు అనూహ్యంగా అభ్యర్థిని ప్రకటించి మిత్రపక్షం సీపీఐని అయోమయంలోకి నెట్టేశారు.
ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ తన అభ్యర్థిగా ముప్పాళ్ల నాగేశ్వరరావును ప్రకటించింది. ఈరోజు ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా, జనసేన అభ్యర్థిగా చల్లపల్లి శ్రీనివాస్ పేరును పవన్ తెరపైకి తీసుకువచ్చారు. దీంతో షాక్ కు గురైన ఎర్రదండు పవన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో జనసేన వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను సీపీఐకి జనసేన కేటాయించింది. అనంతరం కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాలను మార్చడంతో సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేతలతో చర్చల అనంతరం సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని భావిస్తున్న తరుణంలో పవన్ తాజా నిర్ణయంపై సీపీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
అవెంజర్స్ గురించి జేమ్స్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు