telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పృథ్వీ రాజ్ సుకుమారన్ కొత్త సినిమా టీజర్…

ప్రస్తుతం ప్రతి హీరో తన మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు. అయితే మలయాళంలోని అగ్ర హీరోల్లో ఒకడైన పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతడు చేస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు చాలా కొత్తగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే తాజాగా పృథ్వీ చేస్తున్న సినిమా జనగణ మన. నేడు 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సినిమా ట్వీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా క్వీన్ సినిమా దర్శకుడు డిజో జోసే యాంటొనీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ పోలీసుల ఇంటరేగషన్‌తో  ప్రారంభం అవుతోంది. ఒక పోలీసు, ఖైదీకి మధ్య జరుగుతున్న ఇంటారేగషన్‌తో మొదలైన ఈ టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో పోలీస్ పాత్రలో సూరజ్ వెంజరామూడు చేస్తున్నాడు. అదేవిధంగా పృథ్వీ రాజ్ ఖైదీగా కనిపించాడు. ఈ టీజర్‌లో సత్యమే గెలుస్తుందని పోలీస్ అంటున్న డైలాగ్‌తో మొదలవుతోంది. అదే తరహాలు ఇరువురి మధ్య మరికొన్ని ఆసక్తిర డైలాగ్స్‌తో టీజర్ ఉంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే మిలియన్ వ్యూస్‌ సంపాదించి ట్రెండ్ అవుతోంది. మరి ఇంకా తెలుగు అభిమానులను అతను ఏ మేర మెప్పించగలడు అనేది చూడాలి.

Related posts