telugu navyamedia
రాజకీయ వార్తలు

అప్రమత్తంగా ఉండాలి..కేంద్ర హోంశాఖ ఆదేశాలు

international high alert in j & K to tourists

జమ్మూకశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా చర్యలు చేపట్టింది.

డీజీపీలు, కమిషనర్లు, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. అన్నిచోట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలనీ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో బలగాలను మోహరించాలని సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, ఊరేగింపులపై అధికారులు నిషేధం విధించారు.

Related posts