దివంగతనేత ఎస్ జైపాల్రెడ్డి అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైపాల్రెడ్డి రాసిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తక తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను మంగళవారం ఢిల్లీలో ఆన్లైన్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ జైపాల్రెడ్డిఅరుదైన రాజనీతిజ్ఞుడనికొనియాడారు. ఆయనకు విద్యార్థి దశనుంచే విస్తృత అధ్యయనంచేసే ఆసక్తి ఉన్నదని చెప్పారు. జాతీయ, ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యాకారణ సంబంధాలతో, లాజికల్గా ఆలోచించడం జైపాల్రెడ్డి ప్రత్యేకతని అన్నారు.