ఈ మధ్య స్మార్ట్ వాడకం కొందరికి వ్యాసనంగా మారింది. రోజులో ఎక్కువ గంటలు ఫోన్ వాడకంలోనే గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో వాట్సాప్లో అభ్యంతకరమైన అంశాలను పంపిన ప్రైవేటు ఉద్యోగికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. హైదరాబాద్ గోషామహల్ మండి ప్రాంతానికి చెందిన సందీప్ సైన్ ఓ యువతికతో వాట్సాప్లో చాటింగ్ మొదలుపెట్టాడు.
అభ్యంతకరమైన మెసేజ్లను పంపించి, ఆమెను భయాందోళనకు గురి చేశాడు. యువతి ఈ వ్యవహారంపై షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన షీ టీమ్స్ సందీప్ సైన్ను రెండవ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు సందీప్కు ఐదు రోజుల జైలు శిక్షను విధించింది.