telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోస్టింగులు కోసం పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా చేస్తున్నారు

రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని.. తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పోస్టింగులు కోసం టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారన్నారు. అసలు హోమంత్రి, డీజీపీ ఉన్నారా లేదా అనేది తెలియడం లేదని.. విచిత్ర పాలన నడుస్తోందని విమర్శించారు. కొందరు పోలీసులు కావాలనే దళితులపై దాడులు చేస్తున్నారని, కొన్ని చోట్ల కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు కొందరు డ్రగ్స్.. గంజాయి లాంటి వాటిని కూడా వెనకేసుకు వస్తున్నారని అన్నారు. కొందరు పోలీసులు గుర్కా లెక్క పని చేయకండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాకప్ డెత్, అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తా… అందరి సంగతి తేలుస్తాం.. అన్ని వివరాలు తీస్తాం అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మరియమ్మ లాకప్‌డెత్‌‌పై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నేతల్లా తాము రాత్రిపూట వెళ్లి టీఆర్‌ఎస్‌ నేతల్ని కలవలేదని, మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని తాము నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు.

Related posts