కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 21న ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, నిర్మాణ వ్యయం భారీగా పెంచారని ఇటీవల కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లు కాళేశ్వరం నిర్మాణాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని, మంచి పని ఎవరు చేసినా సమర్థిచాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్శారు.
కాళేశ్వరం పూర్తి అయితే నా నియోజకవర్గంలోని సింగూరు, మంజీరకు నీళ్ళు వస్తాయన్నారు. మా సంగారెడ్డికి ఉపయోగపడే అత్యంత పురాతన మహబూబ్ సాగర్కు నీళ్ళు వస్తాయని తెలిపారు. వీటి ద్వారా మా ప్రజల సాగు, త్రాగు నీటి సమస్య తీరుతుందన్నారు. రైతులు, ప్రజల కోసం ప్రాజెక్టు, డ్యాంలు ఎవరు కట్టినా మంచిదే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.