సంక్రాంతి పండుగను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.తెలుగువారందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలకు మనమంతా ఇచ్చే గౌరవానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నామని జగన్ తెలిపారు.