telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్రమ ఇసుక మైనింగ్ పై జనసైనికులు నిఘా ఉంచాలి: పవన్ కల్యాణ్

pawan-kalyan

అక్రమ ఇసుక మైనింగ్ పై జనసైనికులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ఇసుక అవినీతిపై జనసేన పోరాటాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇందుకోసం జనసైనికులంతా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని పవన్ కోరారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానంలోని లోపాల వల్ల 50 మంది భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 35 లక్షల మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారని అన్నారు. చేసిన తప్పులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలుసుకునేలా చేసిన మీడియా, రాజకీయ నేతలు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతోందని ఆయన ట్వీట్ చేశారు.

Related posts