telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఏపీలో జగన్ గెలుపు ఖాయం..తెలంగాణ నేతల ధీమా! 

YS Jagan Files Nomination Pulivendul
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సీఎం కావాలంటూ తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లికి చెందిన పలువురు వైసీపీ నేతలు తిరుమల శ్రీవారిని వేడుకొన్నారు. మంగళవారం ఆపార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ ఆధ్వర్యంలో పలువురు నేతలు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు.
జగన్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలో ఆయన  అభిమానులు కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా  ముగిసిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు తిరుమల యాత్రకు వెళ్లారు.  మెట్లమార్గంలో కొండపైకి చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వ జగన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Related posts