telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బాలు మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి

cm jagan ycp

ప్రముఖ గాయకుడు, సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్తతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 6 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఎస్పీ బాలు పరిస్థితి అత్యంత విషమం అని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచే విషాద ప్రకటనలు మొదలయ్యాయి. 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఎస్పీ బాలు ఈ శుక్రవారం కన్నుమూశారు. ప్లేబ్యాక్‌ సింగర్‌గా, నటుడిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గాంచారు. ఆయన మరణ వార్త తెలియడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

Related posts