నేడు పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తనతో పాటు కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఎన్నికలను కార్యకర్తలే ముందుండి నడిపించాల్సిన పరిస్థితులు రావచ్చని చెప్పారు. ఇవి పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్, రాష్ట్రవ్యాప్తంగా తమపైన, తన పార్టీ లీడర్లపైన విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జరిగే ఈ కుట్రలను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాబాయి వివేకా హత్యను వాళ్లే చేసి ఇంట్లో వాళ్లపైనే నెపం నెట్టే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటన్నింటినీ తిప్పికొట్టి వైసీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల అందరిపైనా ఉందన్నారు.
జగన్ పాలనలో హడావుడి తప్ప అభివృద్ధి శూన్యం: కన్నా