telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు హైదరాబాద్ కు జగన్, యడియూరప్ప.. చినజీయర్‌ స్వామీతో భేటీ!

jagan

ఇటీవల విశ్వాస పరీక్షలో నెగ్గిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుని ఆయనతో సమావేశం కానున్నారు. కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ విశ్వాస పరీక్షలో విజయం సాధించిడంతో అనూహ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి అదిష్టంచారు.

207 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు 104 మంది సభ్యులు అవసరం ఉండగా, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా 106 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఇండిపెండెంట్ కూడా మద్దతు పలకడంతో, మేజిక్ ఫిగర్ ను యడ్డీ సర్కారు అధిగమించింది. ఈ నేపథ్యంలో స్వామి ఆశీస్సుల కోసం యడియూరప్ప హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts