telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

జగన్ క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి కరోనా!

cm jagan ycp

కరోనా వైరస్ అన్నీ శాఖల వారిని టచ్ చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. క్యాంప్ ఆఫీస్ వద్ద విధులను నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

క్యాంపు కార్యాలయం వద్ద 2వ తేదీన వైద్య, ఆరోగ్యశాఖ టెస్టులు నిర్వహించింది. టెస్టు రిపోర్టులు ఈరోజు వచ్చాయి. ఈ టెస్టుల్లో 10 మందికి కరోనా సోకినట్టు తేలింది. కరోనా బారిన పడినవారిలో ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన 8 మంది, మరో బెటాలియన్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

Related posts