వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రీనివాసరావు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. నిందితుడు శ్రీనివాస్రావును శుక్రవారం పోలీసులు ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు.
కాగా శ్రీనివాస్ అభ్యర్థనను న్యాయమూర్తి ముందు ఉంచారు. తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇస్తే.. నిజాలు అన్నీ చెబుతానని నిందితుడు శ్రీనివాసరావు అన్నారు. జగన్ పై దాడి చేయడానికి గల కారణాన్ని తాను పుస్తకంలో రాసానని, ఆ పుస్తకాన్ని జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారని అతను తెలిపాడు. ఆ పుస్తకం తనకు తిరిగి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.