ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం జరుపుకుంటుంది ప్రపంచం అంతా కూడా. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తమ పిల్లలను సరైన దిశలో నడిపిస్తూ, వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేస్తూ అండగా నిలిచే ప్రతీ తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని జగన్ ట్వీట్ చేశారు.
తల్లి, తండ్రి, గురువు, దైవం ఆరాధ్యులని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు నిరంతర స్ఫూర్తి ప్రదాతలని వ్యాఖ్యానించారు. ‘నా తల్లిదండ్రులు కష్టపడి పనిచేసే తత్వాన్నినేర్పారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పిల్లలు తల్లికి పాదపూజ చేస్తారు’ అని చెప్పారు. తల్లిని గౌరవించడం పిల్లలందరికి నేర్పించాలని పునరుద్ఘాటించారు. అందుకే ఏపీలో ‘అమ్మకు వందనం’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు.
అక్రమ సంబంధాలు సాధారణమే… దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు