telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విపక్ష నేతలు గులాబీ గూటికి బారులు: జగదీష్ రెడ్డి

jagadish reddy

తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిని చూసే విపక్ష పార్టీల నేతలు గులాబీ గూటికి బారులు తీరుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత జహీర్, బీజేపీ సీనియర్ నేత సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు రామగిరి నగేష్ లు అనుచరులతో శుక్రవారం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.

అనంతరం సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా రాజకీయం ఆగిపోయి అభివృద్ధి మొదలైందని అన్నారు. ఎన్నికలలో తన గెలుపు కోసం పట్టణ మహిళలు కీలకపాత్ర పోషించారన్నారు. వారు పెట్టిన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ అనివార్యం అని మంత్రి అన్నారు.

Related posts