యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈరోజు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదలైంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ను చిత్రీకరించారు. ఈ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రభాస్ కలిసి కాలు కదిపింది. బ్యాడ్ బోయ్ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసి 20 మిలియన్ వ్యూస్ను రాబట్టుకుంది. అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ సాంగ్ చేయడానికి నిర్మాతలు ఆమెకు భారీగానే ముట్ట చెప్పారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల ప్రకారం ఒక సాంగ్ కోసం జాక్వలిన్ రెండు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకుందని టాక్. జాక్వలిన్ హిందీ సినిమాలతో చాలా పాపులర్ అని తెలిసిందే. దీంతో దర్శక నిర్మాతలు హిందీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని జాక్వలిన్తో స్పెషల్ సాంగ్ చేయించారని, అందుకే భారీగా ఆఫర్ చేసినట్టుగా టాక్. అది అలా ఉంటే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన ముద్దుగుమ్మ. శ్రీలంకలోని కొలంబో పశ్చిమ ప్రావిన్స్లో జన్మించిన జాక్వెలిన్ శ్రీలంకన్ మాజీ మిస్ యూనివర్స్ కూడా కావడం విశేషం.
next post