ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ను కలిసేందుకు వచ్చిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వారికి మంత్రి సుచరిత అనుమతి నిరాకరించారు. ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరుతూ అమరావతి పరరక్షణ సమితి నేతలు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.
అందులో భాగంగా హోం మంత్రికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వారికి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించడంతో జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి ప్రదర్శించిన తీరు సరికాదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా.. మోదీ ప్రభుత్వం రాజకీయాలు: మమత