telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హోం మంత్రిపై జేఏసీ నేతలు ఆగ్రహం

ap minister sucharita on fluds

ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ను కలిసేందుకు వచ్చిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వారికి మంత్రి సుచరిత అనుమతి నిరాకరించారు. ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరుతూ అమరావతి పరరక్షణ సమితి నేతలు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.

అందులో భాగంగా హోం మంత్రికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించడంతో జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి ప్రదర్శించిన తీరు సరికాదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.

Related posts