సెక్స్ రాకెట్ ఉదంతంలో జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబుతో పాటు పరదేశీ కూడా పోలీసులకి దొరికిపోయారు. ఈ నేపథ్యంలో వీరిపై జబర్దస్త్ టీంతో పాటు కమెడియన్ ఆది సీరియస్ అయినట్టు సమాచారం. ప్రముఖ నటి రోజా జడ్జిగా నిర్వహిస్తోన్న ‘రచ్చబండ’ షోకు దొరబాబు దంపతులు వెళ్లబోతున్నారట. ఈ ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సెక్స్ రాకెట్ ఉదంతంపై దొరబాబు భార్య కూడా స్పందించారు. మా ఆయన చాలా మంచి వారని.. అప్పుడప్పుడు మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటూ.. భర్తకు సపోర్ట్గా పలు కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోజా ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళ్లాలనే ప్రయత్నంలో ఆమె ఉన్నట్లు సమాచారం. భర్త దొరబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. పబ్లిక్గానే క్లారిటీ ఇవ్వాలనే నిర్ణయానికి దొరబాబు భార్య వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రచ్చబండ కార్యక్రమానికి పిలిచి అసలు ఆరోజు రాత్రి ఏం జరిగిందనేదానిపై ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం.
previous post