telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” ఎఫెక్ట్ : దిల్ రాజు కు షాకిచ్చిన ఐటీ

Dil-Raju

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలను కూడా తన బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్ హీరోగా తెరకెక్కిన “మహర్షి” సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రేపు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ సోదాలు జరిగాయి. సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. గతంలో కూడా పలు భారీ చిత్రాల విడుదల సమయంలో ఇలాగే నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి.

మరోవైపు “మహర్షి” సినిమాకు తెలంగాణాలో అదనపు షోలకు ఇవ్వమని ప్రభుత్వం అనుమతి లభించింది. అలానే టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా కోర్టు అనుమతించినట్లుగా తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ కలిసి నిర్మించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts