ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్లు కొల్లగొట్టింది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజులకి గాను 25 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టిందని టీం చెబుతుంది. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏవి లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. చిత్రాన్ని టూరింగ్ టాకీస్, పూరి కనక్ట్ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.
previous post
next post
టాలీవుడ్ లో డ్రగ్… మాధవీలత వ్యాఖ్యలపై ఎక్సైజ్ పోలీసుల రియాక్షన్