పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ రామ్ కెరీర్లో తొలిసారి 40 కోట్ల షేర్కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఎనర్జిటిక్ రామ్ హీరో సరసన నిధి అగర్వాల్, నభా నటేష్లు హీరోయిన్లుగా నటించారు. నేటితో ఈ చిత్రం సెంచరీ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల దసరా సందర్భంగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రసారం అయింది. 16.63 పాయింట్స్ టీఆర్పీ రాబట్టి అందరిని ఆశ్చర్యపరచింది. మహేష్ నటించిన మహర్షి చిత్రం కన్నా 180 శాతం రేటింగ్ ఈ మూవీ రాబట్టడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇంత టీఆర్పీ రావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. మాస్ ఎలిమెంట్స్కి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ జోడించి తన మార్క్తో సినిమా తీసాడు పూరీ.
previous post