పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 18న విడుదల అయిన ఈ చిత్రం అదే క్రేజ్తో ముందుకు సాగింది. ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం 37.50 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం. డియర్ కామ్రేడ్తో పాటు మరిన్ని సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు తగ్గలేదు. రామ్ కెరీర్లో తొలిసారి 75 కోట్ల మైలురాయి అందుకున్న సినిమా ఇదే. టెంపర్ తర్వాత సరైన విజయం లేక చూస్తున్న పూరీ జగన్నాథ్కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ ఫుల్ రన్లో 37.50 కోట్లు వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం 16.57 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆంధ్రలో మరో 17 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా ఏపీ తెలంగాణలో 55 కోట్లకు పైగా గ్రాస్.. 34 కోట్ల షేర్ వసూలు చేసింది “ఇస్మార్ట్ శంకర్”. నిజానికి సినిమాలో ఏం లేకపోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ పాత్రకు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామర్ షో అదనపు ఆకర్షణ. ఓవర్సీస్లో కాస్త తడబడినా కూడా మిగిలిన చోట్ల మాత్రం సినిమా కుమ్మేసింది. మొత్తానికి రెండింతలు లాభాలు తీసుకొచ్చాడు “ఇస్మార్ట్ శంకర్”.
previous post
సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్…!