వినాయకచవితి సందర్భంగా దేశవ్యాప్తంగా గణపయ్యకు పూజలు, నైవేద్యాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రిటీలు సైతం వినాయక చవితిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా సినీ ప్రముఖులు వినాయక చవితిని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడమే కాదు… ఆ ఫోటోలను వారి వారి వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. అయితే నభా నటేష్ మాత్రం కాస్త భిన్నంగా తన టాలెంట్ ను నిరూపించుకునే పని చేసింది. ఈ అమ్మడు వినాయక చవితికి మట్టి వినాయకుడిని స్వయంగా తయారు చేయడం విశేషం. నభా మట్టి వినాయకుడిని తయారు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో రూపొందిన “ఇస్మార్ట్ శంకర్”తో ఈ ఏడాది సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న నభా నటేష్ ప్రస్తుతం రవితేజ సరసన “డిస్కోరాజా” చిత్రంలో నటిస్తున్నారు.
previous post
విద్యాబాలన్ ముద్దులతో మెసేజ్ చేసింది… హీరో షాకింగ్ కామెంట్స్