కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో న్యూజిలాండ్ తో జరిగిన 3వ టీ20లో రోహిత్ నేతృత్వంలోని టీమిండియా 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి పేటీఎం సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇష్ సోధి రోహిత్ శర్మ క్యాచ్ పట్టిన తీరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పయి 184 పరుగులు చేసింది. రోహిత్శర్మ(56) హాఫ్ సెంచరీ మరియు బౌలర్ అక్సర్ పటేల్ 3 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 185 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ టీమ్.. భారత బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.
కాగా..న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి 56 పరుగులతో గ్రేట్ గన్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేయడంతో టీమ్ ఇండియాకు బారీ దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో బౌలింగ్ వేస్తున్న ఇష్ సోధి సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టుకున్నాడు.. అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.