telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

వెయ్యి దానికి ఐదు వేలు .. బ్లాక్‌లో ఐపీఎల్‌ టికెట్లు!

ipl-2019-final

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తుది సమరం  ఆదివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను వీక్షించాలని భావించిన వేలాది మంది సామాన్యులకు టికెట్లు లభించలేదని తెలుస్తోంది.అయితే మరోవైపు కొందరు ఈ మ్యాచ్‌ టికెట్లను ముందుగానే బ్లాక్‌ చేశారు. స్టేడియం చుట్టు నంబర్‌ ప్లేట్‌లు లేని బైక్‌లపై చక్కర్లు కొడుతు జోరుగా బ్లాక్‌ టికెట్లను విక్రయిస్తున్నారు. వెయ్యి రూపాయల టికెట్‌ను ఐదు వేలకు, రెండు వేల టికెట్‌ను పదివేలకు అమ్ముతున్నారు.

అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ ముఠా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తెలస్తోంది. టికెట్లు బ్లాక్‌లో దర్శనమివ్వడంతో మ్యాచ్‌ నిర్వాహకుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో లభించాల్సిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లడంపై నగరంలోని కిక్రెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో టికెట్‌ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts