telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

పాక్ లో .. ఐపీఎల్ ప్రసారాలు నిషేదించిన ఇమ్రాన్ ..

shied pak pm imran khan

పాక్ దేశ సమాచార శాఖ ఐపీఎల్ వలన ఆ దేశ క్రికెట్‌కు హాని ఉందని తలంచి ఆయా ప్రసారాలను నిషేధిస్తున్నామని తెలిపింది. ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తూ పాక్ నిర్ణయం తీసుకంది. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ మీడియాతో మాట్లాడుతు ఆ నిర్ణయం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్నదేనని ఫవాద్‌ తెలిపారు. పాకిస్థాన్‌ క్రికెట్‌కు హానీ చేసే అవకాశం భారత్‌ కు ఇవ్వకూడదన్న ఆలోచనతోనే మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

పాక్ క్రికెట్‌ను దెబ్బతీయాలన్న ఆలోచనతోనే భారత్‌.. ఐపీఎల్‌ ప్రసారాలను ఆ దేశంలో సైతం మొదలు పెట్టిందన్నారు. పాక్ సూపర్‌ లీగ్‌కు హాని చేయాలని భారత్‌ చూస్తోందని ఆరోపించారు. ఇప్పటి నుంచి పాక్ లో ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా ప్రసారం చేయవద్దని ఆ దేశ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యూలేషన్‌ అథారిటీ(పెర్మా)కి ఆయన ఆదేశాలు జారీ చేశారు. పాక్ క్రీడలను, కళలను ఆదరిస్తుంది.. కానీ క్రీడాకారులు, కళాకారులకు హాని కలిగించేలా ఉంటే చూస్తూ ఊరుకోమన్నారు.

Related posts