telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్‌రావును పిలుస్తారా?

Ryathu bandhu amount Rs. 10000 in future

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి హరీష్‌రావును పిలుస్తారా అనే దాని పై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ రావు పిలుపు పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నట్టు తెలుస్తోంది.

మరో వైపు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్ట్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారనిసీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 15 శాతం నిర్మాణం కూడా పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభిస్తున్నారని విమర్శించారు. 15 శాతం నిర్మాణానికే రూ. 50 వేల కోట్లు ఖర్చయితే, పూర్తి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు కావాలని ప్రశ్నించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతం పూర్తైన ప్రాజెక్టులకు అడ్డుపడి, తెలంగాణకు గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చేసిందేమీ లేదన్నారు. ఎలాంటి త్యాగం చేయని ఆయనను కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు.

Related posts