“జెర్సీ” చిత్రంలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించి అద్భుత నటన ప్రదర్శించి అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు నాని. తాజాగా ఆ సినిమా విశేషాలను నాని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ సినిమా లోగోను విడుదల చేశాడు. ఎరుపు రంగులో “వి” అని రాసున్న లోగో అకట్టుకునేలా ఉంది. “నా తొలి చిత్రంతో నన్ను ఇంద్రగంటి మోహనకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ రోజు నా 25వ చిత్రంతో మరోసారి పరిచయం చేస్తున్నారు. కాకపోతే ఈ సారి కాస్త విభిన్నంగా.. నా స్నేహితుడు (సుధీర్బాబు) కూడా పార్టీలో చేరబోతున్నాడు” అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో సుధీర్బాబు మరో హీరోగా నటించబోతున్నాడు. నివేధా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్గా రూపొందనున్నట్టు సమాచారం.
previous post
next post