మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో మలయాళ నటుడు జయరామ్ నటిస్తుండగా… సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక సత్యరాజ్, టబు, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించడంతో తాజా ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది (2020) సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేష్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్ అధికారికంగా ప్రకటించాయి. తాజాగా ఈ సినిమా పనులను చిత్రయూనిట్ చకాచకా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయన నటిస్తున్న పాత్ర పూజా హెగ్డేకు అన్నయ్య అని తెలుస్తుంది. అలా ఇప్పుడు బన్నీకి బావ అయిపోతున్నాడు ఈయన. సుశాంత్ చెల్లితో బన్నీ ప్రేమలో పడతాడు. అలాగే బన్నీకి కూడా ఓ చెల్లి ఉంటుంది ఈ చిత్రంలో. ఆమె ఇంకెవరో కాదు నివేదా థామస్. ఈమెతో సుశాంత్ ప్రేమలో పడతాడు. అంటే కుండమార్పిడి అన్నమాట.. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ కథ అల్లాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
previous post